వీటిని ఇలా తీసుకుంటే కేవలం మూడు రోజుల్లోనే కడుపులో మంట, గ్యాస్ అన్నీ సమస్యలకు ఉపశమనం..

ఆహారంలో కల్తీ ఒకవైపు అలాగే సమయానికి ఆహారం తీసుకోక పోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి..ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి..

వీటిని ఇలా తీసుకుంటే కేవలం మూడు రోజుల్లోనే కడుపులో మంట, గ్యాస్ అన్నీ సమస్యలకు ఉపశమనం..


ఆహారంలో కల్తీ ఒకవైపు అలాగే సమయానికి ఆహారం తీసుకోక పోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి..ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. అయితే ఈ సమస్యలను ఆదిగమించడానికి అదిరిపోయే చిట్కా ఒకటి తీసుకొచ్చాము.. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
Coriander Seeds Water : ధ‌నియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటి క‌షాయాన్ని  రోజూ తాగాలి..!
ఈచిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ధనియాలు.. ఇవి మనందరికి తెలిసినవే. దాదాపు ప్రతి ఒక్కరి వంటగదిలో ఇవి ఉంటాయి. వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ధనియాలతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు..ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత అందులో 2టీ స్పూన్ల ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. ఈ విధంగా ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తనాళాలు శుభ్రపడతాయి. నరాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే గుండె సమస్యలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ధనియాల్లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి..
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు ధృడంగా మారతాయి. తిమ్మిర్ల సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ధనియాల కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా ధనియాల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.