కూర్చుంటే నరకం చూపించే పైల్స్.. ఈ చిట్కాలు ఫాలో అవుతూ.. ఈ పోషకాహారం తింటే అంతా సెట్‌..!

నలుగురితో చెప్పుకునేందుకు ఇబ్బంది పడాల్సిన సమస్యల్లో ఒకటి పైల్స్. తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య గురించి ఎక్కడైనా సలహా తీసుకోవాలన్నా,  వైద్యుల్ని కలవాలన్నా మొహమాటపడుతుంటారు చాలా మంది. అలాంటి

కూర్చుంటే నరకం చూపించే పైల్స్.. ఈ చిట్కాలు ఫాలో అవుతూ..  ఈ పోషకాహారం తింటే అంతా సెట్‌..!


నలుగురితో చెప్పుకునేందుకు ఇబ్బంది పడాల్సిన సమస్యల్లో ఒకటి పైల్స్. తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య గురించి ఎక్కడైనా సలహా తీసుకోవాలన్నా,  వైద్యుల్ని కలవాలన్నా మొహమాటపడుతుంటారు చాలా మంది. అలాంటి వారు సరైన ఆహార నియమాలతో ఈ సమస్య నుంచి బైట పడవచ్చు అంటున్నారు వైద్యులు. దీంతోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం కూడా త‌గ్గుతుంది. మ‌రి పైల్స్‌ను త‌గ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

పైల్స్ అనేది అనేక కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంటుంది. మాంసాహారం ఎక్కువ‌గా తిన‌డం, అధిక బ‌రువు, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, డ‌యాబెటిస్‌, థైరాయిడ్‌.. వంటి అనేకం ఈ సమస్యకి కారణాలు.కాబట్టి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే...

1. కిస్మిస్ : రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు కొన్ని కిస్మిస్‌ల‌ను తినాలి. వీటిలో జింక్‌, కాల్షియం, విట‌మిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేయటం కాక .. మ‌రుస‌టి రోజు ఉద‌యం విరేచ‌నం సాఫీగా జ‌రిగేల చూస్తాయి. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. దీంతో పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రాత్రి పూట కిస్మిస్‌ల‌ను నీటిలో నాన‌బెట్టి.. రోజు ఉద‌యం కూడా తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

2. బాదంప‌ప్పు: బాదంప‌ప్పును రోజూ తింటే పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బాదంప‌ప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్- ఈ, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల  పైల్స్ సమస్య నుంచి బైట పడటంలో సహాయ పడతాయి. బాదంప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిపై పొట్టు తీసి తినాలి. దీనివల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోవ‌డంతో పాటు మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ఫలితంగా పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. జామ : మనకు విరివిరిగా దొరికే జామ పండ్ల‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు, జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. జామ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల.. ఆహారం సులభంగా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే పైల్స్ కూడా త‌గ్గిపోతాయి. రోజూ రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత నిద్ర‌కు ముందు ఒక జామ పండును తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

4. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని పెనంపై వేయించి తినాలి. నేరుగా తిన‌లేం అనుకుంటే తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగవుతుంది. మెట‌బాలిజం పెరుగుతుంది. గ్యాస్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అజీర్ణం నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గి పైల్స్ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

5. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం చిన్న బెల్ల ముక్క‌ను తినా మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ రాత్రి బెల్లంను తింటే పైల్స్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.