కంటి చూపు మెరుగుపడాలంటే.. ఉల్లి, ఉసిరితో ఇలా చేయండి..!!
కంటి చూపు సరిగ్గా లేకపోతే.. మీకు కనిపించేది అంతా.. ఒక భ్రమ, నాటకంలానే ఉంటుంది.. ఆర్టిఫీషియల్గా చేసేదానికంటే..మన కళ్లతో చూసినప్పుడు దేన్ని అయినా మనం పూర్తిగా ఆస్వాదించగలం.. కళ్లు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు.. ఏ కంటికి సమస్య వచ్చినా.. మిగిలిన కన్ను కూడా బాధపడుతుంది. ప్రస్తుత తరుణంలో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు.
కంటి చూపు సరిగ్గా లేకపోతే.. మీకు కనిపించేది అంతా.. ఒక భ్రమ, నాటకంలానే ఉంటుంది.. ఆర్టిఫీషియల్గా చేసేదానికంటే..మన కళ్లతో చూసినప్పుడు దేన్ని అయినా మనం పూర్తిగా ఆస్వాదించగలం.. కళ్లు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు.. ఏ కంటికి సమస్య వచ్చినా.. మిగిలిన కన్ను కూడా బాధపడుతుంది. ప్రస్తుత తరుణంలో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. రాను రాను చూపు సన్నగిల్లుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ఎదుట గంటల తరబడి గడపడం, పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో కంటి చూపు పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే
కంటి చూపు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
కంటి చూపు మెరుగు పడాలంటే రోజూ ఆహారంలో 50 గ్రాముల మేర పచ్చి ఉల్లిపాయలను తినాలి. వీటిలో ఉండే సల్ఫర్ మన శరీరంలో గ్లూటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు పెరుగుతుంది.
ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల రోజూ 30 ఎంఎల్ మోతాదులో పరగడుపునే ఉసిరికాయ జ్యూస్ను తాగుతుండాలి. దీంతో కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు.
బాదం పప్పును రాత్రి పూట నీటిలో గుప్పెడు మోతాదులో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో వాటిని పొట్టు తీసి తినాలి. బాదంపప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ కళ్లను సంరక్షిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
త్రిఫల చూర్ణాన్ని చిటికెడు మోతాదులో తీసుకుని రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రాత్రి పూట పాదాలకు ఆవనూనెతో మర్దనా చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. అలాగే ఉదయం వేకువ జామున పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా కొంత సేపు నడవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ ద్రాక్షలను ఒక కప్పు మోతాదులో తింటున్నా కళ్లను రక్షించుకోవచ్చు. దీంతో పాటు రోజూ ఒక కప్పు మోతాదులో దానిమ్మ పండ్ల జ్యూస్ను తాగవచ్చు. దీని వల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది.