వీటిని రోజూ తీసుకుంటే చాలు.. జీర్ణ సమస్యలు, షుగర్‌ మాయం

మన వంట ఇంట్లో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్ని పదార్థలను వాడటం వల్ల అరికాళ్ల నుండి తల వరకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వీటిని రోజూ తీసుకుంటే చాలు.. జీర్ణ సమస్యలు, షుగర్‌ మాయం
Gastric problem


మన వంట ఇంట్లో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్ని పదార్థలను వాడటం వల్ల అరికాళ్ల నుండి తల వరకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు..మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది. దీనిని ఔషధంగా మాత్రమే ఉపయోగించాలి. అధిక బరువు, షుగర్, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనిని వాడడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. వాత దోషాలను తగ్గించడంలో కూడా ఈ జీలకర్ర మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం మెంతులు. వీటిని 5 టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది. వాత దోషాలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో మెంతులు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే మనం ఉపయోగించాల్సిన మూడో పదార్థం వాము...దీనిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది.

షుగర్ ను అదుపులో ఉంచడంలో, జీర్ణసమస్యలను తగ్గించడంలో వాము దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా దీనిని ఉపయోగించడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది..ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా కళాయిలో మెంతులను వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో వాము వేసి వేయించాలి. వామును కూడా వేయించిన తరువాత నల్ల జీలకర్రను వేసి చిన్న మంటపై వేయించి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రాత్రి భోజనం చేసిన గంట తరువాత టీ తాగినట్టు తాగాలి.

ఈ నీటిని తాగిన తరువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే 8 సంవత్సరాల లోపు పిల్లలకు దీనిని ఔషధంగా ఇవ్వకూడదు. ఈ విధంగా ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది..జుట్టు రాలడం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. ఈ విధంగా ఈ పొడిని మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.