రాత్రి తీసుకునే భోజనంలో ఈ పదార్థాలు ఉంటే ఎన్ని అనర్ధాలో తెలుసా.. !
రాత్రి తీసుకునే ఆహారం మాత్రం ఖచ్చితంగా శరీరంపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది.. కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా ఈ సమయంలో తీసుకోకూడదని ఆహార నిపుణులు గట్టిగా చెప్తున్నారు. అయితే అవి ఏంటో ఓ సారి తెలుసుకుందాం..
మారిపోతున్న జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు.. అయితే ఇందులో రాత్రి తీసుకునే ఆహారం మాత్రం ఖచ్చితంగా శరీరంపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది.. కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా ఈ సమయంలో తీసుకోకూడదని ఆహార నిపుణులు గట్టిగా చెప్తున్నారు. అయితే అవి ఏంటో ఓ సారి తెలుసుకుందాం..
ఎంత ఉరుకుల పరుగుల జీవితమైనా ఉదయం, మధ్యాహ్నం సమయంలో తీసుకునే ఆహారానికి రాత్రిపూట తీసుకునే ఆహారానికి కచ్చితంగా వ్యత్యాసం ఉండాలని పలుమార్లు హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.. రాత్రిపూట జీర్ణ క్రియ కొంచెం మందగిస్తుంది.. అందుకే ఎందుకు తగినట్టుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ సమయంలో తీసుకోకపోవటమే మంచిది. అందులో ముఖ్యంగా వరి అన్నాన్ని రాత్రిపూట ఆహారంలో భాగం చేసుకోకపోవడం మంచిది.. దీని బదులుగా చపాతీలను తీసుకోవడం మంచిది.
అయితే రాత్రిపూట అన్నం తీసుకోకుండా ఉండలేము అనుకునేవారు ఏడు ఎనిమిది గంటలకే రాత్రి భోజనాన్ని ముగించడం మంచిదని తెలుస్తోంది అలాగే రాత్రిపూట పెరుగును తీసుకోకూడదు.. పాలు కూడా తీసుకోకూడదు. పాల సంబంధిత పదార్థాలు అన్నీ కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటిని రాత్రిపూట తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య వేధిస్తోంది..
రాత్రి పడుకునే ముందు ఎలాంటి పండ్లను తీసుకోకపోవడం ఉత్తమం.. ఇవి ఆహారం జీర్ణమైనప్పుడు ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాయి.. అలాగే అరటి పళ్ళను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది.. అదే విధంగా రాత్రిపూట మాంసాహార పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఇవి జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి తినేసి వెంటనే నిద్రపోతాం కాబట్టి మన ఆరోగ్యం పైన వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలుస్తుంది..