మామిడిపళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కటి ఒక్కో స్పెషల్ మరి!
సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎక్కువగా తినే పండు మామిడి పండు. ఒక రకంగా చెప్పాలి అంటే మామిడిపండు పళ్ళలు ను పండ్ల లో రారాజు అని పిలుస్తుంటారు ఈ మామిడిపండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.కేవలం పండుగ మాత్రమే కాకుండా ఆవకాయ దగ్గర
సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎక్కువగా తినే పండు మామిడి పండు. ఒక రకంగా చెప్పాలి అంటే మామిడిపండు పళ్ళలు ను పండ్ల లో రారాజు అని పిలుస్తుంటారు ఈ మామిడిపండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.కేవలం పండుగ మాత్రమే కాకుండా ఆవకాయ దగ్గర నుండి లస్సీ తయారు చేసే వరకు ఎన్నో తినే పదార్థాలలో మామిడిపండును ఉపయోగిస్తారు అంటే అతిశయోక్తి లేదు. కేవలం మన దేశంలోనే సంవత్సరానికి 25 మిలియన్ టన్నులకు పైగా మామిడి పండ్లను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నము.
చాలామంది ఈ మామిడి పంటను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వారికి ఈ మామిడి పండ్లను ఎన్ని రకాలు ఉన్నాయో సాధారణంగా తెలియదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి, సువర్ణ రేఖ, కలెక్టర్, రసాలు, బండి రకాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి వీటి యొక్క రుచి, కలర్ భిన్నంగా ఉంటాయి. అందువల్లనే వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది
దక్షిణాదిన ఒక రకంగా మామిడి పండ్లను పిలుస్తుండగా బీహార్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ మంటి రాష్ట్రాలలో మామిడి పండ్లను చౌస, దాసేహరి లంగ్ర, ఖైరి వంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. లెక్క ప్రకారం సమ్మర్ సీజన్లో మార్చి మొదలవగానే మామిడి పండ్లు అందుబాటులోకి రావాలి. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల ఇవి మార్చి కంటే ముందే అందుబాటులోకి వస్తున్నాయి
సీజన్ ముగిసే సరికి మహారాష్ట్రలో మంచి హపస్ లేదా అల్ఫోన్సో మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. ఈ మామిడి పండ్లు రంగు, వాసన రెండు కూడా మిగిలిన రకాల మామిడిపండ్లతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది.
పైరి మామిడి, మార్కెట్లోకి వచ్చే మరో మామిడి రకం. ఇది జ్యుసిగా ఉండటమే కాదు, మామిడి యొక్క రంగు మరియు పరిమాణం అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రసిద్ధి చెందింది.
దశేరి అనేది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధానంగా కనిపించే మరొక ప్రసిద్ధ మామిడి జాతి. తీపి రుచి కారణంగా ఉత్తర భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే మామిడి రకాల్లో ఇది ఒకటి.
మామిడి మొదట వారణాసికి చెందినది, దీనికి బనారసి లాంగ్రా అని పేరు వచ్చింది. మామిడి ఆకుపచ్చ రంగులో ఉంటుంది మరియు అది పండిన తర్వాత కూడా దానిని నిర్వహిస్తుంది.
హిమ సాగర్ మామిడి పశ్చిమ బెంగాల్లో ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. రంగు పసుపు మరియు ఆకుపచ్చ మధ్య మారుతూ ఉంటుంది. ఇది ఉత్తమ వేసవి పండు మరియు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది.